Ram Charan | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది సల్మాన్ బర్త్డే అంటేనే బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈసారి ఆ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపించింది. అభిమానులతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ప్రత్యేకంగా మార్చారు. పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ తన కొత్త సినిమా టీజర్ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. టీజర్ రిలీజ్తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతున్నాయి.
అయితే ఈ వేడుకల్లో బయటకు వచ్చిన ఓ ప్రత్యేకమైన ఫోటో మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ ఫ్రేమ్లో సల్మాన్ ఖాన్తో పాటు భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోని, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కలిసి కనిపించారు. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో దర్శనమివ్వడంతో అభిమానులు సంబరపడుతున్నారు.సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. రామ్ చరణ్ బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఈ స్నేహం మరింత బలపడిందన్న మాట వినిపిస్తోంది.
అలాగే బాబీ డియోల్ కూడా సల్మాన్కు సన్నిహితుడే. అయితే వీరితో పాటు ఎం.ఎస్. ధోని కూడా అదే ఫ్రేమ్లో కనిపించడం మాత్రం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్గా మారింది. సాధారణంగా సినిమా వేడుకలకు అరుదుగా హాజరయ్యే ధోని, సల్మాన్ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం, అక్కడ రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్తో కలిసి కనిపించడం ప్రత్యేక ఆసక్తిని రేపింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు “ఇది నిజమైన లెజెండ్స్ మీటింగ్”, “ఇండియన్ సినిమా, ఇండియన్ క్రికెట్ ఒకే ఫ్రేమ్లో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్రేమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.