స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15).తాజాగా ఆర్సీ 15 షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మేకర్స్ రేపు హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ పాటను షూట్ చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ టీం మిగిలిన షూటింగ్ పార్టును రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూట్ చేయబోతుందట.
దీనిపై అఫీషియల్ అప్డేట్ ఏమీ లేకున్నా రాంచరణ్ అండ్ శంకర్ యూనిట్ హైదరాబాద్లో సందడి చేయబోతున్నారన్న న్యూస్ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోల్ సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్సీ 15 చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. శంకర్ మరోవైపు కమల్హాసన్తో ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఓ వైపు ఆర్సీ 15, మరోవైపు ఇండియన్ 2 సినిమాలను వీలైనంతగా త్వరగా పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు శంకర్.