టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సాంగ్పై కియారా వెడ్డింగ్ ఎఫెక్ట్ పడ్డది. జైసల్మీర్లో ఇవాళ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ వెడ్డింగ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో పాట చిత్రీకరణ తేదీని రీ షెడ్యూల్ చేసింది చిత్రయూనిట్. తాజా అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి 9న ఈ సాంగ్ షూట్ చేయబోతున్నారట. అంటే కియారా పెళ్లయిన మూడు రోజులకే అన్నమాట. మరి కియారా రీషెడ్యూల్ చేసిన రోజు అనుకున్న ప్రకారం చిత్రీకరణలో పాల్గొంటుందా..? అనేది చూడాలి. సిద్దార్థ్-కియారా వెడ్డింగ్కు ఆర్సీ 15 యూనిట్ హాజరుకానున్నట్టు సమాచారం.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా.. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.