రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవలే హైదరాబాద్లో ఓ షెడ్యూల్ పూర్తయింది.
తాజా షెడ్యూల్ను ఈ నెల 23 నుంచి మైసూర్లో మొదలుపెట్టబోతున్నారు. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఓ సాధారణ యువకుడు అసాధారణ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి సామాజిక సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా.