వినయ విధేయ రామ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ మరి కొద్ది రోజులలో శంకర్తో కలిసి పని చేయబోతున్నాడు. చరణ్ 15వ చిత్రంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో కియారా అద్వాణీ(kiara advani) హీరోయిన్ గా నటిస్తోంది.
రాజకీయ నేపథ్యంలో సినిమా సాగనుందని తెలుస్తుండగా,ఇందులో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సమాచారం. భారతీయుడు రేంజ్ లో సినిమా ఉండబోతుందని అంచనాలు ఆకాశాన్నంటున్నతున్నాయి. ఇందులో మలయాళ స్టార్ హీరో విలన్గా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. సహజంగా శంకర్ సినిమాలో విలన్ పాత్రలు చాలా బలంగా కనిపిస్తాయి.చరణ్ చిత్రంలో ప్రధాన విలన్ గా మలయాళం స్టార్ సురేష్ గోపీని దించాలని ఆలోచన చేస్తున్నారట.
శంకర్ మార్క్ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో శ్రీకాంత్..సునీల్ ..అంజలి కాలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.