Ram Charan | వెలుగుల పండుగ దీపావళి (Diwali 2023) సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్- ఉపాసన దంపతులు నిర్వహించిన ఓ పార్టీలో టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్ తన కుటుంబంతో కలిసి సందడి చేశారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్- ఉపాసన దంపతులు శనివారం ఓ ప్రత్యేక విందు పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతీతో కలిసి ఈ పార్టీలో మెరిశారు. అదేవిధంగా మరోస్టార్ జంట మహేశ్ బాబు (Mahesh Babu)-నమ్రత కూడా హాజరయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్స్ జంటలు ఒకే ఫ్రేమ్లో కనిపిండచంతో మెగా, ఘట్టమనేని, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇదే పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ముగ్గురు అగ్ర హీరోలు తమ తదుపరి సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమాతో మహేశ్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు.