‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అగ్రహీరో రామ్చరణ్ ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా సతీష్ కిలారు నిర్మాతగా టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
‘రామ్చరణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు బుచ్చిబాబు సానా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని సిద్ధం చేశాడు. భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ‘కొన్ని సమయాల్లో తిరుగుబాటు ఓ అవసరంగా మారుతుంది’ అంటూ ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థల్లో ఒకటైన సుకుమార్ రైటింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం క్రీడా నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.