Ram Charan-Upasana | మన టాలీవుడ్ హీరోలు షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ టైమ్ దొరికందంటే చాలు ఫ్యామిలీతో వెకేషన్ చుట్టేస్తుంటారు. కాగా తాజాగా రామ్చరణ్, ఆయన భార్య ఉపాసనతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వెకేషన్ పూర్తి కాగానే గేమ్ చేంజర్ మూవీ మేజర్ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే బంధు మిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉపాసన బేబి షవర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాపై పూర్తి దృష్టిని పెట్టాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథను అందించాడు. చరణ్కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.