రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామ్చరణ్ నటిస్తున్న 15వ చిత్రమిది. కియారా అద్వాణీ కథానాయిక. రాజకీయ, సామాజికాంశాలతో రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల కర్నూల్, హైదరాబాద్లో ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ఈ సినిమాకు టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్చరణ్ పాన్ ఇండియా స్టార్గా మారారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
టైటిల్, ఫస్ట్లుక్ కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 27న రామ్చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్లుక్ విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి సిటిజన్, అధికారి, సర్కారోడు, విశ్వంభర వంటి టైటిల్స్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఏదో ఒక టైటిల్ను ఖరారు చేయొచ్చని సమాచారం. ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.