రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైంది.
ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్తో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా నాయకానాయికలు రామ్, శ్రీలీల మైసూర్ ఎయిర్పోర్ట్లో తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియాలో అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.