Konda Surekha – Rakul Preeth Singh | తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించింది. మీ రాజకీయాల కోసం తన పేరును ఇకనుంచి అయిన తీయడం మానేయాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు టాలీవుడ్ సినీ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నటి సమంత, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్లపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సమంతకు, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్పై టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, నాని, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెలతోపాటు పలువురు స్పందించారు. ఇప్పుడు తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించింది.
ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకతకి.. నైపుణ్యానికి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రతీకగా చూస్తున్నారు. నేను ఈ ఇండస్ట్రీలో చాలా కాలం ప్రయానించాను ఇంకా అది కొనసాగిస్తున్నాను. ఇటువంటి ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరంగా ఉంది. మరి దారుణమైన విషయం ఏంటంటే అవి ఇంకొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుండి వినడం ఇంకా మనసు విరిచేసేలా ఉంది. గౌరవం కోసం మనం నోరు తెరవకుండా ఉంటే దాన్ని మా బలహీనతగా చూస్తున్నారు.
నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు ని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి. ఆర్టిస్ట్లను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం అర్థం లేని కథల్లో మమ్మల్ని లాగకండి అంటూ రకుల్ చెప్పుకోచ్చింది.
Telugu Film Industry is known worldwide for its creativity and professionalism. I’ve had a great journey in this beautiful industry and still very much connected.
It pains to hear such baseless and vicious rumours being spread about the women of this fraternity. What’s more…— Rakul Singh (@Rakulpreet) October 3, 2024