Rakul Preet Singh | దశాబ్ద కాలం పాటు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది రకుల్ ప్రీత్సింగ్. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢిల్లీ సోయగం అనతికాలంలోనే అగ్ర కథానాయికగా వెలుగొందింది. రెండు మూడేళ్ళ క్రీతం వరకు ఈమె పట్టిందల్లా బంగారమే. హిట్ల మీద హిట్లతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్గా పేరు పొందింది. అయితే గత కొంత కాలం నుండి ఈమె గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె జాడనే లేదు. గతేడాది వైశ్ణవ్ తేజ్తో కలిసి ‘కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఈమె నుండి మరో సినిమా రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది.
సౌత్లో ఇప్పటివరకు విభిన్న చిత్రాలు చేసినప్పటికీ పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం చేయలేదని తెలిపింది. ‘దిల్వాలే దుల్హానియా లేజాయెంగే’, ‘ఏ జవానీ హై దీవానీ’ లాంటి లవ్ స్టోరీస్లో నటించాలనుందని పేర్కొంది. అలాగే ఇతరులకు స్పూర్తి కలిగించే ప్రముఖులు బయోపిక్లు, చారిత్రక చిత్రలను చేయలనుందని పేర్కొంది. ప్రస్తుతం ఈమె నటించిన నాలుగు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు బాలీవుడ్వి కావడం విశేషం. ఇక మరో రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తమిళ-తెలుగు ద్విభాష చిత్రంగా తెరకెక్కుతుంది.