Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సూపర్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తారక్, రాంచరణ్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. రకుల్ రీసెంట్గా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీభగ్నానీ (బాయ్ ఫ్రెండ్)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్తో ఒక్కటయ్యారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రకుల్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్లలో F-45 పేరుతో జిమ్లను ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్లకు వెలుతుంటారు. మరోవైపు వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లో రకుల్కు పార్ట్నర్షిప్ ఉంది. అయితే ఇవికాకుండా నేరుగా ఫుడ్ బిజినెస్లోకి రకుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో ‘ఆరంభం’ పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్లో ఈ నెల 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఇందులో మిల్లెట్స్తో చేసిన వంటకాలు లభించనున్నాయి. దీనిపై రకుల్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.