టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో డేటింగ్లో ఉందని తెలిసిందే. ఈ ఇద్దరూ తరచూ కెమెరా కంటికి చిక్కుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంటారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఇద్దరు టాలీవుడ్ నటి లక్ష్మి మంచు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఫండ్రైజర్ ఫ్యాషన్ షోలో జాయిన్ కాబోతున్నారు. ఫిబ్రవరి 19న యాన్యువల్ ఫండ్ రైజర్ 8వ ఎడిషన్లో సందడి చేయబోతున్నారు.
డిజైనర్ వరుణ్ చక్కిలమ్ అవుట్ఫిట్స్లో రకుల్-జాకీ భగ్నానీ ర్యాంప్ వాక్ చేయబోతున్నారు. 2014లో చైతన్య ఎంఆర్ఎస్కేతో కలిసి టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజర్ను ప్రారంభించింది లక్ష్మి మందు. రాబోయే ఎడిషన్ వెనుకబడిన తరగతుల పిల్లలకు సరైన విద్య అందించే లక్ష్యంతో నిర్వహించబోతున్నారు. ఏడాదిపాటు మెరుగైన విద్య కోసం టీచ్ ఫర్ చేంజ్ (Teach for Change) చేపట్టబోయే పలు క్యాపెంయిన్లకు ఈ ఫండ్ను విరాళంగా ఇవ్వనున్నారు.
అంతేకాదు ఈ షోలో పలువురు దక్షిణాది సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్ యాక్టర్లు, సింగర్స్, క్రీడాకారులు పాల్గొననున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్కూళ్ల స్థాయిల్లో చదివే పిల్లల్లో అక్షరాస్యత రేటు పెంచే ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ను ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 432 ప్రభుత్వ స్కూళ్లతో కలిసి పనిచేసింది. 42,608 మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.