పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్ తొలిసారి బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్తో జోడీ కట్టనుందా?అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విష్ణువిశాల్ హీరోగా తమిళంలో రూపొందిన ‘రాక్షసన్’ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మిషన్ సిండ్రెల్లా’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ రీమేక్లో అక్షయ్కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. రంజీత్ ఎం తివారి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రకుల్ప్రీత్సింగ్ను హీరోయిన్గా ఎంపికచేసినట్లు తెలిసింది. స్కూల్ టీచర్ పాత్రలో ఆమె కనిపించనున్నది. ఆగస్ట్ నెలలో లండన్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.