బాలీవుడ్ నటి, బిగ్బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ పీపీఈ కిట్లో కూరగాయలు కొనడానికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కూరగాయలు అమ్మే వ్యక్తితో ఆమె బేరమాడటం ఈ వీడియోలో చూడొచ్చు. కరోనా టైమ్లో ఆమె ఇలా పీపీఈ కిట్లో పూర్తి జాగ్రత్తలు తీసుకొని వెళ్లడం బాగానే ఉంది కానీ.. తరచూ మాట్లాడే సమయంలో రాఖీ తన మాస్క్ తీస్తూ కనిపించింది. మాలాంటి పేదవాళ్ల నుంచి మీరు లాక్డౌన్లో టైమ్లో చాలా డబ్బు తీసుకుంటారు. ఈసారి అలా చేయకు అని వీడియోలో రాఖీ అరవడం విశేషం.
చివరిగా తన కూరగాయల బిల్లు కేవలం రూ.260 మాత్రమే అయిందంటూ కూరగాయలు అమ్మే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పింది. అయితే కూరగాయల వ్యక్తితో బేరమాడటంపై చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. మనకంటే వాళ్లకే డబ్బు ఎక్కువ అవసరం అని ఒకరు కామెంట్ చేయగా.. నువ్వు పదేపదే మాస్క్ తీసి మాట్లాడుతుంటే పీపీఈ కిట్ వేసుకున్నా వేస్టే అంటూ మరొకరు కామెంట్ చేశారు.