దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కరణ్జోహార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. రణ్వీర్సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అశ్లీల పదాలతో పాటు రాజకీయ సంబంధమైన సంభాషణలను తొలగించాలని ఆదేశించింది.
రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేపథ్యంలో వచ్చే ఓ సుదీర్ఘమైన డైలాగ్ను కూడా మార్చాలని నిర్మాతలకు సూచించింది. ఓ మద్యపాన బ్రాండ్ పేరును ఉపయోగించడంతో పాటు మహిళల లోదుస్తుల గురించిన పదాల పట్ల సెన్సార్ బోర్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచేలా ఆ పదాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ చిత్రంలో జయాబచ్చన్, షబానా ఆజ్మీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.