యధార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ద్వారా గెటప్శ్రీను హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి కె. దర్శకుడు. ఈ నెల 17న ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్ విషయంలో ఈ సినిమా టీం వేగం పెంచింది. ఇందులో భాగంగా శనివారం ఈ సినిమాకు చెందిన ఓ విషాద గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ‘లేదే లేదే ప్రేమసలే..’ అంటూ సాగే ఈ గీతాన్ని చంద్రబోస్ రాసి, ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. గుండెలు బరువెక్కేంత విషాదాన్ని చంద్రబోస్ తన గొంతులో పలికించారని, అత్యంత సహజంగా, వాడుక భాషతో మనసుల్ని కరిగించేలా ఈ పాటను చంద్రబోస్ రాశారని వారు తెలిపారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయని, ఆ అంచనాలను మించి సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని, త్వరలోనే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు. సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతున్నది.