తమిళ సూపర్స్టార్ రజనీకాంత్పై వయసు కూడా ప్రభావం చూపించలేకపోతున్నది. ఏడు పదులు దాటినా తలైవా ఇమేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా విజయం సాధిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ‘జైలర్’ సినిమాతో నిరూపణ అయ్యింది. 220కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650కోట్లు వసూలు చేసి, రజనీకాంత్ స్టామినా ఏంటో తెలియజెప్పింది. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రజనీ. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకోసం కోట్లాదిమంది తలైవా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే.. ‘కూలీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమాలో నటించినందుకు గాను 150కోట్ల పారితోషికాన్ని రజనీకాంత్ అందుకున్నారనేది ఆ వార్త సారాంశం.
ఇదే గనుక నిజమైతే.. ఇండియాలోనే రికార్డుగా నిలుస్తుందని అంటున్నారు. భాగస్వామ్యం, పర్సంటేజ్ విధానాలతో ప్రమేయం లేకుండా, కేవలం పారితోషికంగా మాత్రమే 150కోట్లు తీసుకోవడం దేశంలోనే రికార్డట. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 375 కోట్లని తెలుస్తున్నది. అందులో రజనీ 150కోట్లు, లోకేష్ కనకరాజ్ 50కోట్లు పారితోషికాలను అందుకోగా, ఇతర పారితోషికాలు, సినిమా మేకింగ్కి మిగిలిన 275కోట్లు ఖర్చుపెడతారన్నమాట. మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు 240కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఇంకా జరగాల్సిన బిజినెస్ చాలా ఉంది. మొత్తం మీద సినిమా నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే సేఫ్ జోన్లోకి వచ్చేశారన్నమాట. మరి తలైవానా మజాకా!