చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ మళ్లీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్ చేశారు. ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది చెప్పిన తలైవా.. ఇవాళ అన్ని జిల్లాలకు చెందిన రజినీ మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్లతో భేటీకానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లో చేరాలా వద్దా అన్న అంశాన్ని చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. 70 ఏళ్ల రజనీకాంత్ గత ఏడాది రాజకీయ పార్టీ ఆవిష్కరించే దిశగా అడుగులు వేశారు. కానీ 2020 డిసెంబర్లో ఆ ఆశలపై నీళ్లు పోశారు. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడం లేదని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడించారు. కరోనా చికిత్స తర్వాత అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న రజనీ మళ్లీ ఇటీవల చెన్నై చేరుకున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.