భారతీయ సినిమాలో తిరుగులేని స్టార్డమ్ను సంపాదించుకున్నారు సీనియర్ కథానాయకులు కమల్హాసన్, రజనీకాంత్. అభిమానులు వారిని లివింగ్ లెజెండ్స్గా అభివర్ణిస్తారు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరు కలిసి నటించిన చాలా చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. తాజా సమాచారం ప్రకారం ఈ అగ్ర నటులిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇటీవల విడుదలైన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’తో లోకేష్ కనకరాజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కమల్హాసన్కు ఈ సినిమా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. దాదాపు 300కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ ఇద్దరు సూపర్స్టార్స్తో పాన్ ఇండియా సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. 2023లో ఈ సినిమా సెట్స్మీదకు వచ్చేందుకు అవకాశం ఉందని, దాదాపు 300కోట్లతో ఈ సినిమా రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.