Rajinikanth | ఇప్పటికిప్పుడు ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడు ఎవరని గూగుల్ని అడిగినా ప్రభాస్ పేరే చెప్తుంది. ఆయన కాకుండా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, విజయ్ దలపతి ఇలా పలు పేర్లు వినిపిస్తుంటాయి. అయితే ఊహించని విధంగా ఇప్పుడు సూపర్ స్టార్ పేరు టాప్ ప్లేస్కి వచ్చేసింది. ఒకప్పుడు హైయెస్ట్ పేయిడ్ యాక్టర్ ఎవరంటే మరో మారు ఆలోచించకుండా రజనీకాంత్ పేరే చెప్పేవారం. పుష్కరకాలం కిందటే రజనీ రెమ్యునరేషన్ అటు ఇటుగా రూ.45-50 కోట్ల మధ్యలో ఉండేదట. కాగా ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో ఆయన క్రేజ్ కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ జైలర్తో జై అని లేచాడు.
ఏడు పదుల వయసు దాటిన రజనీ.. జైలర్ కోసం ముందుగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఇక జైలర్ ఊహించని రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టడంతో కళానిధి మారన్ జైలర్ లాభాల్లో కొంత షేర్ను గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ కొంత మొత్తం రూ.110 కోట్ల అని చెన్నై టాక్. మొత్తంగా చూసుకుంటే రజనీ జైలర్ సినిమాకు అందుకున్న మొత్తం రూ.210 కోట్లు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ రెండు రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా అధనంగా BMW కారును కూడా గిఫ్ట్గా ఇచ్చాడట.
ఇదే నిజమైతే గనుక ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రజనీ సరికొత్త రికార్డు సృష్టించిన్నట్లే. పలువురు హాలీవుడ్ హీరోలను సైతం రెమ్యునరేషన్లో రజినీ డామినేట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్కు మాములు లాభాలు తెచ్చిపెట్టలేదు. తంతే బంగారు బుట్టలో పడ్డట్లు కోట్లకు కోట్లు లాభాలు అర్జించాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.