32 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ కలిసి నటించబోతున్నారు. రజనీ నటిస్తున్న 170వ సినిమాలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారని సమాచారం. వీరిద్దరు కలిసి గతంలో మూడు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అమితాబ్, రజనీ కలిసి నటించే సందర్భం కుదరలేదు. దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందించనున్నారు. గతంలో ఈ పాత్రకు హీరో విక్రమ్ను అనుకోగా…తాజాగా ఈ అవకాశం అమితాబ్ దగ్గరకు వెళ్లింది. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంతో పాటు తన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రజనీ 170 సెట్స్ మీదకు వెళ్లనుంది.