లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఓ బిజినెస్ ట్రిప్ లో భాగంగా ఆయన ఇటీవల యూఎస్ వెళ్లగా, అక్కడ నుండి తిరిగి వచ్చాక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గు రావడంతో వైద్య పరీక్షల చేయించారు. పరీక్షల అనంతరం కమల్ హాసన్ కి కోవిడ్ సోకినట్లు డాక్టర్స్ ధృవీకరించారు. వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్స్ బృందం కమల్ హాసన్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కమల్ కోవిడ్ బారినపడ్డారని తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ఆయనకు ఫోన్ చేశారు. కమల్ తో మాట్లాడిన రజినీ… ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కమల్ తెలియజేసినట్లు సమాచారం. దర్శక దిగ్గజం కె బాలచందర్ శిష్యులైన రజనీకాంత్, కమల్ హాసన్ కోలీవుడ్ స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే..
కాగా రజనీతో పాటు ప్రముఖ తమిళ ప్రముఖులు ప్రభు, శరత్కుమార్, విష్ణు విశాల్, శివకార్తికేయన్, ఎస్పీ ముత్తురామన్, లోకేష్ కనగరాజ్, ఫహద్ ఫాసిల్, అట్లీ, ఇషారి గణేష్, విక్రమ్ ప్రభు కూడా కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.