రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో డా॥ జగన్మోహన్ డీవై నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘కరోనా సమయంలో ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ ఇది. ఒరిస్సా నుంచి రాజమండ్రి వరకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది.
నా మనసుకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారు ప్రేక్షకుల్ని టెన్షన్ పెడుతూనే నవ్విస్తారని నిర్మాత జగన్మోహన్ తెలిపారు. హృదయాన్ని స్పృశించే ఫీల్గుడ్ మూవీ ఇదని దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగాని, సంగీతం: ఎస్.శివ దినవహి, సంభాషణలు: పరుచూరి బ్రదర్స్, సమర్పణ: బెక్కెం వేణుగోపాల్, కథ, నిర్మాత: డా॥ జగన్మోహన్, రచన-దర్శకత్వం: వెంకటేష్ పెదిరెడ్ల.