అగ్ర హీరో ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఫస్ట్ టికెట్ను అగ్ర దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ ఫోటోను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్లో షేర్ చేసింది.
‘భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి ఫస్ట్ టికెట్ను కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. నైజాంలో ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ లభిస్తాయన్న నమ్మకం ఉంది’ అని ట్విట్టర్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది. ఈ ఫొటోలో రాజమౌళితో పాటు నిర్మాత నవీన్ యెర్నేని, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్నీల్, హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరంగదూర్ ఉన్నారు. ‘సలార్’ చిత్రాన్ని నైజాంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.