Radhe Shyam | ఒక సినిమా హిట్టైన ఫ్లాప్ అయినా ఆ చిత్ర హీరో-దర్శకుల మధ్య స్నేహం ఏర్పడటం సర్వ సాధారణం. అందులో టాలీవుడ్లో ప్రభాస్-రాజమౌళి ఫ్రెండ్ షిప్ ఒకటి. వీళ్లిద్దరి మధ్య ‘ఛత్రపతి’ సినిమా నుంచే మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా వీళ్లిద్దరూ కలవడం సినిమా గురించి గంటలు గంటలు మాట్లాడటం చేసేవారని గతంలో రాజమౌళి చెప్పాడు. ‘బాహుబలి’ సినిమా నుంచి వీళ్లు మరింత క్లోజ్ అయ్యారు. అప్పుడే రాజమౌళి తన ట్విట్టర్లో ‘ప్రభాస్ ఈజ్ మై సోల్మేట్’ అంటూ ట్వీట్ను చేశాడు. అప్పట్లో అది వైరల్ కూడా అయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రభాస్ చిత్ర ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్, రాజమౌళి కలిసి ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వూ జరిపారు. ఈ సందర్భంగా ప్రభాస్.. రాజమౌళిని రాధేశ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడిగాడు. దానికి రాజమౌళి ‘నువ్వు నా డార్లింగ్.. నీ కోసం ఏదైనా చేస్తాను’ అంటూ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుస్తుంది. నిజానికి రాజమౌళి తన మొదటి సినిమాను ప్రభాస్తో తెరకెక్కించాలని ‘స్టూడెంట్ నం.1’ కథ చెప్పాడట. కానీ ప్రభాస్కు ఈ కథ నచ్చకపోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని ప్రభాస్ ఓ ఇంటర్వూలో చెప్పాడు.
‘రాధేశ్యామ్’ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై అత్యంత భారీగా ప్రమోద్, వంశీ, ప్రశీదలు నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణం రాజు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది.