ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చర్చ నడుస్తుంది. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుండగా, చిత్రంకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఆర్ఆర్ఆర్ మూవీ టీం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్తో పాటు హీరోయిన్ అలియా భట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చింది.ఈ క్రమంలో రాజమౌళి అసలు ఆర్ఆర్ఆర్కి ఎలా బీజం పడిందో చెప్పుకొచ్చాడు. ఓ రోజు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్లకి కాల్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడట. ముందుగా ఎన్టీఆర్.. జక్కన్న ఇంటికి రాగా, ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చాడు. అయితే చెర్రీ, ఎన్టీఆర్ ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారట.
ఇంటికి వచ్చే వరకు రాజమౌళి ఏ విషయం వాళ్లకు చెప్పలేదట. ఇంటికి వచ్చాక మీ ఇద్దరితో సినిమా చేస్తున్నాను అని రాజమౌళి అనగా, ఫస్ట్ షాక్ అయిన వారు మూవీ చేసేందుకు ఆసక్తి చూపించారట. ఇద్దరు హీరోలకు ముందుగా ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పిన చెప్పిన రాజమౌళి ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమా కథను, పాత్రల గురించి వివరించాడట. ఆ రకంగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందింది.
గోండు వీరుడు కొమురం భీమ్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ …ఆర్ ఆర్ఆర్ చిత్రంలో నటిస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్లో ‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్ గా చెప్పవచ్చు.