న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.160 పెరిగి రూ.48,880కి చేరింది. క్రితం ట్రేడ్ తులం 24 క్యారట్ బంగారం ధర రూ.48,720 గా ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్లో ఇవాళ 22 క్యారట్ బంగారం ధర కూడా రూ.150 పెరిగి రూ.44,800కు పెరిగింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.44,650 వద్ద ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.90 పెరిగి రూ.46,856కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,766 వద్ద ముగిసింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ రూ.490 పెరిగి రూ.67,988కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,498 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,809 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.21 అమరికన్ డాలర్లు పలికింది.