రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా నటిస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. రామ్ భీమన దర్శకుడు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ…‘మంచి కథ, కథకు తగిన సాంకేతిక నిపుణులు కుదిరారు. రాజ్ తరుణ్కు బాగా సరిపోయే చిత్రమిది. పాన్ ఇండియా ఆర్టిస్టులను తీసుకుంటున్నాం.
మేము మరిన్ని చిత్రాలు తీసేందుకు ఈ సినిమా పునాది వేస్తుందని ఆశిస్తున్నాం. జూన్ 1వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్తో పాటు రాజమండ్రి, కేరళ, విదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం’ అన్నారు. నిర్మాత రమేష్ తేజావత్ మాట్లాడుతూ..‘ఇప్పటిదాకా తెలుగు తెరపై రాని కథ ఇది. అందుకే మా సంస్థలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : గోపీసుందర్.