అశ్లీల చిత్రాల రాకెట్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే జైలులో ఉన్న సమయంలో రాజ్కుంద్రాపై చాలా మంది దారుణమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అయితే లెక్కే లేదు. ఈ వివాదం నుండి రాజ్కుంద్రా ఇంకా బయటపడలేదు.ఇప్పటికీ ఆయనపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రాజ్ కుంద్రా తన రెండు సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం చర్చనీయాంశమైంది. రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలయ్యాక.. ఆయనతో ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోలు వీడియోలను శిల్పాశెట్టి షేర్ చేశారు. శిల్పాశెట్టి ఎట్టకేలకు జనంలోకి వెళుతున్నారు. తన వృత్తి జీవితంలో కూడా తిరిగి బిజీ కానున్నారు. కాని రాజ్ కుంద్రా ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సాలువాల వ్యాపారి నీలిచిత్రాల వ్యాపారిగా మారిన వైనంపై చర్చ అప్పట్లో దేశంలో ప్రకంపనాలు రేపింది. బాలీవుడ్ నిర్మాత .. బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారంపై పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. నటి షెర్లిన్ చోప్రా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం అప్పట్లో పెద్ద సేన్సేషన్ అయింది.