రాగిణి ద్వివేది కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘సారి’. ‘కర్మ రిటర్స్న్’ ఉపశీర్షిక. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ కుమార్ నిర్మాత. జూన్లో హైదరాబాద్లో మూడో షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాగిణి ద్వివేది మాట్లాడుతూ ‘సూపర్హీరో కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
నటిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. యాక్షన్ ఘట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇకపై నేను తెలుగు సినిమాలు కూడా చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది. చేసిన తప్పుకు ఎంతటి వారైనా శిక్షననుభవించ తప్పదనే సందేశంతో సాగే యాక్షన్ చిత్రమిదని, రాగిణి ద్వివేది నటన ప్రధానాకర్షణగా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ గణేశన్, సంగీతం: రాజు ఎమ్మిగనూరు, రచన: బోయనపల్లి రమణ, దర్శకత్వం: బ్రహ్మ.