ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్తను చిత్రయూనిట్ చెప్పింది. ఈ నెల 23న రామోజీ ఫిలింసిటీలో ‘రాధేశ్యామ్’ ప్రీ-రిలీజ్ వేడుకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు భాషల్లో సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు రాధేశ్యామ్ టీం వెల్లడించింది. అభిమానులే అతిథులుగా ఈ వేడుక నిర్వహిస్తామని చెప్పింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 14న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.