సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ రాధే శ్యామ్. యూరప్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్ స్టోరిగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ప్రేమికులను, ప్రేక్షకులను ఎలా అలరించనుందో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఈ రాతలే, నగుమోము తారలే అనే పాటలకు చాలా మంచి స్పందన వచ్చాయి.
ఇక త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని ఓ టాక్ వినిపిస్తుండగా, అది కుదరకపోతే డిసెంబర్ 21న పక్కాగా వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఎదుటివారి చేతి రేఖలను చూసి వారి భవిష్యత్తును చెప్పగల నేర్పరి అయిన హీరో.. తన ప్రేయసి చేతి రేఖలను చూసి ఆమె ప్రమాదాలను పసిగడతాడు. ఆమెను ఆ ప్రమాదాల బారి నుంచి ఎలా రక్షించుకున్నాడనేదే సినిమా కథగా వార్తలు వినిపిస్తున్నాయి.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సంక్రాంతి బరిలో రాధేశ్యామ్తో పాటు ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు విడుదలకానున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది.