ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ‘నగుమోము తారలే..తెగిరాలె నేలకే.. ఒకటైతే మీరిలా చూడాలనే..సగమాయె ప్రాయమే’ అంటూ ప్రణయ భావనలకు అద్దం పట్టిన ఈ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాల్ని అందించగా సిధ్శ్రీరామ్ ఆలపించారు. సముద్రతీర ప్రాంతంలో నాయకానాయికలు విహారం నేపథ్యంలో ఈ పాటను అందంగా చిత్రీకరించారు. ఇటలీ నేపథ్యంలో సాగే వింటేజ్ ప్రేమ కథా చిత్రమిది. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రిక విద్యలో ప్రావీణ్యుడైన విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ఖేడ్కర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.