వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోనాల వెంకటేష్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘నేల మీద నేనున్నా’ అనే గీతాన్ని ఇటీవల బిగ్బాస్ ఫేమ్ సొహైల్ విడుదల చేశారు. కొల్లి చైతన్య స్వరపరచిన ఈ పాటను మహాలింగం, మానసి ఆలపించారు.
వసంత్ వెంకట్ రచించారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిదని, వినూత్న కథాంశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. మేక రామకృష్ణ, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తాజ్ జీడీకే. సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్ వెంకట్ బాలా, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.