రాశీ ఖన్నా లాక్డౌన్లో తన అందచందాలతో కుర్రకారు మనసులే కాదు నిర్మాతల హృదయాలు కూడా దోచుకుంది. దీంతో అమ్మడి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తుంది రాఖీ. 2013లో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయన రాశీ ఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.
దాదాపు అందరి హీరోల సరసన ఆడిపాడిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్యూ’తో పాటు గోపీ చంద్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమిళంలో ఇప్పటికే ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలను పూర్తి చేసి ప్రస్తుతం.. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్దార్’ సినిమాలో నటిస్తోంది.
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోను రాశీ కథానాయికగా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఓ సినిమాతో పాటు అజయ్ దేవగణ్ నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తుండగా, షూటింగ్ లొకేషన్కి సంబంధించిన పిక్ షేర్ చేసింది. కుర్చిపైనే కునుకు తీస్తున్నట్టు ఉండగా, ఆ ఫోటోకి ‘షూటింగ్ గ్యాప్ల మధ్యలో ఇలా నిద్రపోతుంటాను. నిద్రలో వెకేషన్ గురించి కలలు కంటుంటాను’ అని ఆసక్తికరమైన క్యాప్షన్ను ఇచ్చింది.