గత ఏడాది ‘థాంక్యూ’ చిత్రం నిరాశపరచడంతో ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలపై దృష్టి పెడుతున్నది రాశీఖన్నా. వెబ్సిరీస్లలో కూడా సత్తా చాటుతున్నది. ఇటీవల ఆమె నటించిన ‘ఫర్జీ’ సిరీస్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అందులో రాశీఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా మాట్లాడుతూ ‘సినిమాలకు, వెబ్సిరీస్లకు నటన విషయంలో పెద్ద తేడా ఉండదు. షూటింగ్ వాతావరణం కూడా ఒకేలా అనిపిస్తుంది. అ యితే సినిమాల్లో నటిస్తే వచ్చే కిక్ వేరు. పెద్ద తెరపై మనల్ని మనం చూసుకోవడం గొప్ప అనుభూతి. అందుకే నా తొలి ప్రాధాన్యత సినిమాలకే. అయితే ఓటీటీ సిరీస్లలో ప్రయోగాలకు ఆస్కారం ఉంటుం ది. మంచి కాన్సెప్ట్లను ఎంచుకోవచ్చు’ అని చెప్పి ంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘యోధ’ చిత్రంలో నటిస్తున్నది