దక్షిణాది చిత్రాల్లో ఎనిమిదేళ్ల పాటు రాణించిన పంజాబీ సుందరి రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెడుతున్నది. కెరీర్ ఆరంభంలో హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకొని దక్షిణాది బాటపట్టిన ఈ అమ్మడు మరలా బాలీవుడ్పై ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె ‘యోధా’ అనే చిత్రంతో పాటు అజయ్దేవ్గణ్ సరసన ‘రుద్ర’ వెబ్సిరీస్లో నటించింది. వీటితో పాటు ‘ప్యామిలీమెన్ ’ సిరీస్ దర్శకద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న తాజా సిరీస్ ‘బ్లెస్సింగ్’లో నటిస్తున్నది. బాలీవుడ్లో తన ప్రయాణం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ ‘తొలిరోజుల్లో కథల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ మంచి కథలొస్తున్నాయి. ప్రతి పాత్ర ఓ సవాలుగా అనిపిస్తున్నది. నటిగా నాలోని కొత్తకోణాల్ని ఆవిష్కరించుకునే పాత్రలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. బాలీవుడ్లో నా సెకండ్ఇన్సింగ్స్ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది’ అని చెప్పింది.