సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజ యోగం’. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకుడు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హీరో విశ్వక్ సేన్ అతిథిగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..‘రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. యూత్కు నచ్చే అంశాలుంటాయి.
సాయిరోనక్ను కొత్త తరహా పాత్రలో చూస్తారు. సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకర్షణ అవుతాయి. ఎం.ఎం శ్రీలేఖ స్వరపర్చిన ప్రత్యేక గీతం ఆకట్టుకుంటుంది’ అన్నారు. హీరో సాయిరోనక్ మాట్లాడుతూ…‘ఫైట్స్, డాన్సులు ఉన్న సినిమాలో నటించాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ వంటి అన్ని అంశాలుంటాయి. డబుల్ మసాలా బిర్యానీ లాంటి చిత్రమిది’ అన్నారు.