Pushpa The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్పరాజ్గా మరోసారి టైటిల్ రోల్లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా కొత్త అప్డేట్ ఏం ఉండబోతుందని ఎదురుచూస్తున్న వారి కోసం ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
తాజా టాక్ ప్రకారం పుష్ప.. ది రూల్ షూటింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీఫిలింసిటీలో షురూ అయింది. అల్లు అర్జున్తోపాటు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను తాజా షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం సీక్వెల్లో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్గా కనిపించబోతున్నాడట. క్యూరియాసిటీ పెంచేలా పార్టు 1కు శుభం కార్డు వేసిన సుకుమార్.. సీక్వెల్ పార్టులో ఫహద్ ఫాసిల్ను ఎలా చూపించబోతున్నాడో సస్పెన్స్లో పెడుతూ అంచనాలు పెంచేస్తున్నాడు.
పుష్ప ది రూల్ ఫుల్ లెంగ్త్ హై డోస్ ఎలివేషన్తో సాగనుందని, ఇందులో ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్. సీక్వెల్లో ప్రత్యేకించి అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ మధ్య వచ్చే నాలుగు యాక్షన్ సన్నివేశాలు, జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నాయట. ఈ యాక్షన్ సీక్వెన్స్ను హాలీవుడ్కు చెందిన టీం పర్యవేక్షణలో షూట్ చేస్తున్నట్టు టాక్. సీక్వెల్ కోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఫస్ట్ పార్టును మించిపోయే మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతుందని సమాచారం.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా సీక్వెల్లో కూడా సందడి చేయనుంది. రష్మిక పుష్ప ది రూల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నట్టు కూడా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
పుష్పరాజ్ ఎక్కడ..?