అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. కొద్ది రోజుల ముందు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, తాజాగా కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్ చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కాకినాడలో ఉన్న బన్నీ తెగ సందడి చేస్తున్నాడు. పుష్ప సినిమా షూటింగ్లో భాగంగా ఆయన రెండు రోజుల పాటు కాకినాడలోనే ఉండనున్నాడు. బన్నీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు వచ్చారు. టీ షర్ట్, షార్ట్స్లో సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించి అందరిని పలకరించాడు.
కాకినాడలోఖాళీ టైంలో బన్నీ.. సీటీమార్ సినిమా చూసేందుకు పద్మప్రియ థియేటర్కి వెళ్లాడు.మ్యాట్నీ సినిమా చూసిన బన్నీ సినిమా తనకి నచ్చిందని పేర్కొన్నాడు. ఇక ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈనెల చివరి వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేయనున్నారట దర్శకుడు సుకుమార్. క్రిస్మస్ కానుకగా తొలి పార్ట్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.