బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సహా పలు భాషల్లో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల ‘పుష్ప’ సినిమా ఇక అవార్డుల వేటలో పడింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ‘ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్’గా పురస్కారం దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందడం అరుదైన విషయం. ఈ ఫిలిం ఫెస్టివల్ ఆదివారం ముంబైలో తారల తళుకుల మధ్య ఘనంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా షేర్షా, ఉత్తమ నటుడిగా రణ్వీర్ సింగ్ (83), ఉత్తమ నటిగా కృతి సనన్ (మిమి) పురస్కారాలు గెల్చుకున్నారు. క్రిటిక్స్ మెచ్చిన చిత్రంగా ‘సర్దార్ ఉద్ధమ్’ నిలిచింది.
విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన తెలుగు లఘుచిత్రం ‘మనసానమ:’ ఉత్తమ షార్ట్ ఫిలింగా అవార్డు దక్కించుకుంది. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు దీపక్రెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు.