అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన ‘పుష్ప’ చిత్రం గతేడాది విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతీయ బాక్సాపీస్ వద్ద 350కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా రష్యా ప్రేక్షకుల్ని కూడా అలరించడానికి సిద్ధమవుతున్నది.
డిసెంబర్ 8న రష్యాలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ‘పుష్ప’ రష్యన్ లాంగ్వేజ్ ప్రీమియర్ షోలను డిసెంబర్ 1, 3వ తేదీల్లో మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్లో ఏర్పాటు చేశామని చిత్రబృందం తెలిపింది. మాస్కోలో జరిగే ప్రీమియర్ షోకు చిత్ర దర్శకుడు సుకుమార్, నాయకానాయికలు అల్లు అర్జున్, రష్మిక మందన్న, నిర్మాత రవిశంకర్ హాజరవుతారని ‘పుష్ప’ సినిమా టీమ్ ప్రకటించింది.