ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ పార్ట్ ను ‘పుష్ప: రైజ్’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. కాని పరిస్థితులు చూస్తే ఆ డేట్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇంత వరకు టీజర్, ట్రైలర్స్ విడుదల చేయకపోగా, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.
‘పుష్ప’ పార్ట్-1 ఆలస్యమైతే ఆ తేదీకి రావాలని మరికొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప’ చెప్పిన డేట్ కి రాకపోతే మాత్రం.. ‘ఆచార్య’ ను తీసుకెచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా ఆ డేట్ కి రావాలని చూస్తోందట. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను ల ‘అఖండ’ కూడా ఆ తేదీ కోసం చూసే అవకాశం ఉంది.
పలు కారణాల వలన పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే తేదీకి నాని ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు ‘పుష్ప’ ఆ తేదీకి రావాలని అనుకుంటే.. నాని సినిమాని వారం ముందుకు జరపాలని ప్రయత్నిస్తున్నారట.