సుకుమార్.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఇదే. ఆర్య, 100 పర్సంట్ లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప2.. ఈ సినిమాలు దర్శకుడిగా ఆయనేంటో చెబుతాయి. ‘రంగస్థలం’ సినిమాతో దర్శకునిగానే కాక, కథకునిగా కూడా ఆయన కితాబులందుకున్నారు. గత ఏడాది ‘పుష్ప’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారంటే, అందులో సుకుమార్ పాత్ర ఎంతోవుంది. తాజాగా ‘పుష్ప-2’కు ఆయన ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. డైరెక్టర్ సుకుమార్ కీర్తికిరీటంలో దీన్ని ఓ కలికితురాయిలా చెప్పుకోవచ్చు. ‘పుష్ప-2’ చిత్రం ఆయన కథన కౌశలంతో బాక్సాఫీస్ బరిలో సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే.