Disha Patani | ఈ మధ్య వచ్చిన ఐటమ్ సాంగ్స్లో ది బెస్ట్ అంటే.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ పాటే అనాలి. ఆ పాటలో సమంత స్క్రీన్ ప్రెజన్స్ మామూలుగా ఉండదు. తన అందంతో అభినయంతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. సమంత. దేవిశ్రీ సంగీతం, ఇంద్రావతి స్వరం, చంద్రబోస్ సాహిత్యం ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పాలి.
మరి ఆనవాయితీ ప్రకారం ‘పుష్ప2’లో కూడా ఇలాంటి ఐంటమ్ నంబర్ ఒకటి ఉండాలికదా. అది కూడా తొలి పార్ట్లోని ఐటమ్నంబర్కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండాలి. అందుకే దిశా పటానీని ఎంపిక చేశారు సుకుమార్. తొలి పార్ట్లోని పాటను మించేలా అద్భుతమైన గీతాన్ని దేవిశ్రీ స్వరపరిచినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ వారంలోనే దిశాతో ఐటమ్సాంగ్ చిత్రీకరించనున్నారు సుకుమార్. ఇక దిశా పటానీ విషయానికొస్తే.. ఆమె తొలి సినిమా పూరీజగన్నాథ్ ‘లోఫర్’. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో ఎం.ఎస్.ధోనీ, బాగీ2, బాగీ3, ఏక్ విలన్ రిటర్న్స్ తదితర చిత్రాల్లో నటించి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏ.డి’, సూర్య ‘కంగువ’ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషిస్తున్న దిశా పటానీ.