Puri Jagannadh-vijay devarakonda | డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబోలో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు ఇదివరకే ప్రకటన వచ్చింది. అయితే అది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ అని గతం నుంచే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు.యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బుల్లెట్లతో పోస్టర్ నిండి ఉంది.
దేశభక్తిని చాటి చెప్పే సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై వంశీ పైడిపల్లి, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ‘లైగర్’ చిత్రం తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై వీధుల్లోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గర్తించే బాక్సర్గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్తో పూరీ పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కరణ్ జోహర్, ఛార్మీలతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.