Jana gana mana | దర్శకుడు పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్ట్ ‘జన గణ మన’. దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రశ్నాస్ర్తాలు సంధిస్తూ పూరి జగన్నాథ్ దాదాపు పదేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నారు. కొన్నేళ్ల క్రితం మహేష్బాబు కథానాయకుడిగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పవన్కల్యాణ్తో పూరి జగన్నాథ్ ఈ సినిమా చేయబోతున్నారని వార్తలొచ్చాయి. అదీ కార్యరూపం దాల్చలేదు. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండతో ఈ సినిమాను రూపొందించేందుకు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరి జగన్నాథ్ ట్విట్టర్లో ఓ వాయిస్ నోట్ పెట్టారు. ఇందులో పరోక్షంగా ‘జన గణ మన’ సినిమా గురించి ప్రస్తావించారు. “లైగర్’ షూటింగ్ పూర్తయింది. ఈ రోజుతో ‘జన గణ మన..’ అని పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించారు. దీంతో పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్ట్కు రంగం సిద్ధమైందని అభిమానులు అనుకుంటున్నారు.