ఒకప్పుడు టాలీవుడ్ కథానాయికగా అలరించిన ఛార్మీ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో సందడి చేస్తుంది. పూరీ కనెక్ట్స్ వ్యవహారాలని చూసుకుంటూ నిర్మాణంలో భాగస్వామిగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ఛార్మి ఇప్పుడు లైగర్ అనే సినిమాని నిర్మిస్తుంది. కరణ్ జోహార్తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది.
తాజాగా లైగర్ షెడ్యూల్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. లైగర్ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షం కాగా, వీరు ముంబైకి పయనమవుతున్నట్టు తెలుస్తుంది. రేపటి నుండి లైగర్ చిత్రం తర్వాతి షెడ్యూల్ని స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా మూవీ చిత్రీకరణ పూర్తి చేయనున్నారట.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న “లైగర్ష చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాక్సర్ పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. లైగర్ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఒక స్టార్ సెలబ్రిటీ ఉండబోతున్నారట. ఆ సెలబ్రిటీ రాక సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం. అయితే ఆ సెలబ్రిటీ మరెవరో కాదు మైక్ టైసన్ అని ఇండస్ట్రీ వర్గాల విశ్లేషణ.